రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బతుకమ్మ పండుగ చీర పంపిణీ కార్యక్రమం ఈ రోజు 18వ వార్డు లో కౌన్సిలర్ పోలోజు సత్యనారాయణ చారి కొత్తగూడెం క్లబ్ లో 18వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ చారి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు గారి చేతులమీదగా అందచేశారు. దీనిపై కౌన్సిలర్ చారి మాట్లాడుతూ తెలంగాణలో ఎంతో అద్భుతంగా జరిగే పండుగ ఈ దసరా అని ఈ పండుగని రాష్ట్ర ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకోవాలి అని అగ్రవర్ణ కుటుంబాలతో సమానంగా ప్రతి పేద కుటుంబం జరుపుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం 18వ వార్డు లో ప్రజలకు అందించటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు అంగన్వాడీ టీచర్లు, RP లు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: