👉 తెరాస గ్రామస్థాయి ప్లీనరీ విజయవంతం
👉 నవంబర్ 15 న వరంగల్ లో జరిగే విజయ గర్జన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన తుర్రం శ్రీనివాసరావు.
మాన్యం మనుగడ/ప్రతినిధి:ములకలపల్లి:
తిమ్మంపేట లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభ ను ఉద్దేశించి తుర్రం శ్రీనివాసరావు మాట్లాడుతూ,రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలో జనరంజక పాలన సాగుతుందని,అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని,ఏళ్ళ తరబడి అపరిష్కృతంగా ఉన్న పొడుభూముల సమస్య శాశ్వత పరిష్కారం దిశగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మూలంగా ఎన్నో గిరిజన కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పొడుభూముల సమస్యను పరిస్కారం చేస్తే ఆదిలాబాద్ మొదలు భద్రాచలం వరకు గిరిజనులు కేసీఆర్ కు రుణపడి ఉంటారని,ఈ కార్యక్రమంలో పోతుగంటి క్రాంతి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్నిరకాలుగా ఆలోచించి పొడుభూముల సమస్యలను పరిష్కరించి గిరిజనులకి న్యాయం చేస్తుందని,అన్ని వర్గాలవారికి అండగా ఉంటుందని స్థానికంగా కూడా ఏ సమస్య ఉన్న పార్టీ దృష్టికి తేవాలని, మేమంతా మీకు అండగా ఉంటామని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పోతుగంటి భూమయ్య, తుర్రం పంతులు,కోండ్రు వీరబద్రం, శెట్టుపల్లి భాస్కరరావు,క్రాంతి,జలగం సుభాష్, కటికనేని ఆదిత్య, సోయం నరేష్, రవ్వ.నరేష్, కొరస పవిత్ర, తుర్రం ఈశ్వరి, మడకం సరోజిని,బిట్టా రమణ,సోయం రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: