మన్యం మనుగడ, పినపాక:
పోడు సమస్య పరిష్కారం అయ్యేదాక రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని అఖిలపక్షం నాయకులు అన్నారు. పోడు సాగుదారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పోడు మహాసభ పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో జి.వి.ఆర్ ఫంక్షన్ హల్ లో మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ మీడియం బాబురావు మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో ఒక్క ఎకరా పోడు భూమికి కూడా సీఎం కేసీఆర్ పట్టా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కుర్చీ వేసుకుని పట్టాలు ఇస్తానని ఎన్నో సార్లు చెప్పారని, ఎప్పుడు కుర్చీ వేసుకుని ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాలు ఇవ్వక పోగా పోడు రైతులపై పీడీ యాక్టులు, క్రిమినల్ కేసులు పెడుతున్నారని తెలిపారు. హరితహారం పేరిట సాగులో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారని, పోడు భూముల విషయంలో అటవీ, పోలీసు శాఖల తీరు ఆక్షేపనీయమన్నారు. తక్షణమే రైతులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.పొలికేక సదస్సులో మిత్ర పక్షాలకు చెందిన వివిధ నాయకులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: