👉 కోవిడ్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం
👉★ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆకస్మికంగా సందర్శించిన డి ఎం హెచ్ ఓ-జె వి ఎల్ శిరీష ★
మన్యం.మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి(అక్టోబర్-08):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక ఆధ్వర్యంలో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంను వైద్య ఆరోగ్య శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారిణి డాక్టర్ జెవిఎల్ శిరీష ఆకస్మికంగా సందర్శించి, హర్షం వ్యక్తం చేశారు.కరోనా వ్యాధితో మరణించే మరణాల రేటును తగ్గించేందుకు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన గ్రామాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ను, మర్రిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు ఉదయం నుంచి రాత్రి సమయం వరకు వ్యాక్సిన్ అందించి విజయవంతంగా నిర్వహించారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తహశీల్దార్ భద్రకాళి, వైద్య బృందం డిపిఎంఓ- ఐ వెంకటేశ్వరరావు, హెచ్వీ-శారారాణి, గ్రామ పంచాయతీ కార్యదర్శి-బాలాజీ, ఏఎన్ఎంలు- కలం జయ, పొన్నారి, ఎస్ పుష్ప రాజ్యం, నాగజ్యోతి, ఆశాలు ఉన్నారు.
Post A Comment: