మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని విప్పలగుంపు గ్రామంలో ఘనంగా కొమరం భీమ్ 81 వ వర్ధంతి కార్యక్రమం ఆదివాసీ ఐక్య వేదిక కార్యదర్శి గోగ్గల కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.కొమరం భీమ్ చిత్రపటానికి గ్రామ పెద్దలు సురపల్లి పొట్టయ్య, ఎట్టి ముసలయ్య నివాళులు అర్పించి, ఆదివాసీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా ఎంపీటీసీ కాయం శేఖర్ , అమరారం సర్పంచ్ మొగిలిపళ్లి నర్సింహారావు, టీఎస్ జెన్కో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి సిద్దెల హుస్సేన్, ఆదివాసీ సీనియర్ ఉపాధ్యాయులు పోలేబొయిన బాబురావు,తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్ష్యులు కొమరం వెంకటేష్ హాజరయ్యారు. వక్తలు ఆదివాసీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కొమరం పోరాట స్ఫూర్తి ఆదివాసీ హక్కులు, చట్టాల అమలుకు ,సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు, హుస్సేన్ ఆదివాసీ గీతాలతో ఉర్రూతూగించారు. గ్రామస్థులు గోగ్గల అబ్బయ్య, కొమరం రాంబాబు, కొమరం నాగేశ్వరావు, ఆదివాసీ యూత్ కొమరం రామకృష్ణ, ఎట్టి దసరధం, కాక సురేష్, పేరంటళ్లు సూరపల్లి కన్నమ్మ, ఎట్టి సారమ్మ, మద్దెల శాంత, తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: