👉ప్రభుత్వం ఆదుకోవాలి:బాధిత రైతు కొమరం రామయ్య వేడుకోలు
గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 17 (మన్యం మనుగడ) పాము కాటుకు గురై దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన ఆళ్ల పల్లి పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామంలో చోటు చేసుకుంది. యజమాని కొమరం రామయ్య చెప్పిన కథనం ప్రకారం రాత్రి గడ్డివాము సమీపంలో కట్టేసి ఉండగా పాము కరిచి మృతి చెందిందని ఆయన తెలిపారు. దాని విలువ సుమారు గా 40 వేల రూపాయలు ఉంటుందని రామయ్య చెప్పారు. రెండు ఎద్దులు ఉంటేనే అంతంత మాత్రంగా సాగుతున్న వ్యవసాయం ఓక ఎందుకు చనిపోవడం వలన దున్నడం ఇబ్బందిగా మారుతుందన్నారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు
Post A Comment: