మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామంలో ఆదివారం బతుకమ్మ ఊరేగింపు సంబరాలు అంబరాన్ని తాకాయి. అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు, ఆడపడుచులు, యువకులు చప్పట్లతో, కోలాట ధ్వనులతో బతుకమ్మ పాటలతో, మేళా తాళాలతో అమ్మవారిని గ్రామ పురవీధుల్లో బాణాసంచా, డప్పు, వాయిద్యాలు, డీజే సాంగ్స్, ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ మార్గం నుండి వెళ్తున్నా దివగంత మాజీ ఎంఎల్ఏ వగ్గెల మిత్రసేన మనవరాలు అయినటువంటి నియోజక వర్గ నాయకురాలు వగ్గెల పూజ అక్కడ ఆగి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని వారితో బతుకమ్మ ఆటలు ఆడారు, పాదం కలుపుతూ స్టెప్పులు వెసారు. గ్రామలో వున్నా కుటుంబాలన్నీ కూడా అమ్మవారికి పళ్లు ఫలహారాలు సమర్పించి, అమ్మ వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సంబరాలలో మాజీసర్పంచ్ లు ముద్దిన కొండయ్య, ముద్దిన రాములు, వార్డ్ మెంబెర్ జగపతి, కమిటీ సభ్యులు పెన్నాడ చిట్టిబాబు, తోట ముక్తేశ్వరావు, దానపు భాగ్యరాజు, గణప రామకృష్ణ, మహిళలు, యువకులు, పిల్లలు పాల్గొన్నారు.
Post A Comment: