గుండాల అక్టోబర్ 17 (మన్యం మనుగడ) మండల కేంద్రంలో జరిగిన వివాహ వేడుకకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి, కరకగూడెం ఎంపీపీ రేఖ కాళిక హాజరయ్యారు. గుండాల మండలం టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు సయ్యద్ అజ్జు సోదరి వివాహం ఆదివారం మండల కేంద్రంలో జరిగింది ఈ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ఆళ్ల పల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, టిఆర్ఎస్ పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు సాగర్ యాదవ్, యామ్ పాటి సందీప్ రెడ్డి , గుండాల మండల టిఆర్ఎస్ అధ్యక్షులు తేల్లం భాస్కర్, కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య , పద్దం శ్రీను, గుర్రం సృజన్, మోకాళ్ళ వీరస్వామి , ఆదాం, సుధాకర్, సతీష్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య , వట్టంరవి, కోస్సా లాలయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: