మడకం విజయ.
మాన్యం టివి/ప్రతినిధి:ములకలపల్లి మండలం:పాత గంగారం గ్రామంలో కొమరం భీమ్ జయంతి సందర్భంగా జెండా ఎగురవేసి,ఘనంగావేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా గంగారం ఎంపిటిసి మడకం విజయ మాట్లాడుతు ఆదివాసీల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం కొమరం భీమ్ అని, గిరిజనుల ఆరాధ్య దైవం కోమరం భీమ్ అని,అణగారిన గిరిజన అడవి బిడ్డల హక్కులకోసం అనేక పోరాటాలు చేసి, గుండె నెత్తురులు దార బోసిన ఆదివాసీ వీరుడు కొమరం బీమ్ అని అన్నారు.నేటి ఆదివాసీ యువత కొమరం భీమ్,సోయం గంగులు,పూనెం లింగన్న లాంటి వారి జీవితాలను అధ్యయానం చేసి,వారు చూపిన బాటలో నడుస్తూ,ఆదివాసీలకు అడవులపై ఏజెన్సీ పై పూర్తి హక్కులు వచ్చేవరకు పోరాటాలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మడకం సురేష్,ఇరపా ప్రసాద్,తాటి భద్రం,యడమ రమేష్,ఇరపా కృష్ణ,ఇరపా రవి గ్రామస్తులు మరియు ఆదివాసీ యువత పాల్గొన్నారు.
Post A Comment: