మన్యం టీవీ మంగపేట.
మండలం లోని జడ్పి.ఎస్. స్కూల్ రాజుపేటలో చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గీత, బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ మంజుల ఆధ్వర్యంలో బాలల సమస్యలపై అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రతి గ్రామం లో బాలల పరిరక్షణ కమిటీ క్రియాశీలకంగా బాలల సమస్యలు పరిష్కరించాలని,బాలలువేధింపులు, హింస,అకృత్యాలనుండి తమంతట తాము రక్షించుకోలేరు. పైగా తాము ఇలా వేధింపులకు గురి అవుతున్నాం అని గుర్తించే ఆలోచన స్థాయి కూడా వారికి ఉండక పోవచ్చు.కానీ స్థానికంగా ఉన్న పరిస్థితుల గురించి, బాలలకు ఎదురయ్యే ప్రమాదాల గురించి స్థానికులకే ఎక్కువ తెలుస్తాయి కాబట్టి స్థానికంగా ఉండే గ్రామస్తులు,బాలల పరిరక్షణ కమిటీ సహాయ సహకారాలతో వేధింపులకు, అత్యాచారాలు,హింస కు గురవుతున్న బాలలను రక్షించాలి లేదా పోలీస్ లకు తెలియజేయండి ఇది పౌరులు గా మన బాధ్యత అంటూ బాలల పరిరక్షణ కమిటీ, గ్రామ ప్రజలకు తెలియజేశారు.బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి, బడిలో పిల్లలను కొట్టడం, తిట్టడం లాంటివి లేకుండా చూడాలి. బాల్యవివాహాలు నిషేధం, బాలల పై ఎటువంటి ఉల్లాంఘనలు జరిగిన వెంటనే చైల్డ్ లైన్ -1098 మరియు 100 హెల్ప్ లైన్ డి. సి. పి. ఓ. కి ఫోన్ చేసి సమాచారం అందించాలి అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గీత, బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ మరియు జడ్పి ఎస్ స్కూల్ ప్రధానోపాద్యురాలు మంజుల, గ్రామ పరిరక్షణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: