CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉత్తమ అవార్డు గ్రహీతలైన విద్యాశాఖ మండల అధికారిణి కీసర లక్ష్మి , ఉపాధ్యాయుడు సోయం రవిబాబు లను సన్మానించిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి(దమ్మపేట):: ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అందించే ఉత్తమ అవార్డులకు దమ్మపేట మండల ఎంఈవో కీసర లక్ష్మి, చలమప్పగూడెం గ్రామంలోని యుపిఎస్ స్కూల్ ఉపాధ్యాయుడు సోయం రవిబాబు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన అభినందన సభలో కీసర లక్ష్మి, సోయం రవిబాబు లను ప్రధానోపాధ్యాయులు ఆర్ పద్మావతి,పి డి శ్రీనివాస్ రెడ్డి మరియు ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు ఘనంగా శాలువాలతో సత్కరించి, అభినందించి పాఠశాలలకు వారు అందించిన సేవలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో చలమప్పగూడెం గ్రామ సర్పంచ్ దార నరసింహారావు, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ బండారు వెంకటేశ్వరరావు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు,పలువురు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థినీ,విద్యార్థులు ఉన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: