మన్యం టీవి, దమ్మపేట:
దమ్మపేట మండలం లో విస్తృత పర్యటన జరిపిన అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ యువ నాయకురాలు పూజా వగ్గేల .మల్కారం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీరాములు ప్రసాద్ గారిని పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై చర్చించి అనంతరం ఆ గ్రామ సర్పంచ్ రూప్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం దమ్మపేట టౌన్ లో మాజీ సర్పంచ్ అత్తులూరివెంకట రామారావు గని కలిసి వారి ఆరోగ్యం గా ఉండాలని వారితో మాట్లాడటం జరిగింది.అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు MA కబీర్ ని, చిన్నంశెట్టి చిట్టి బాబు ని, కక్కిరాల రమేష్ ని, కందుల వెంకటేశ్వర రావు ని కలిసి దమ్మపేట లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చర్చించడం జరిగింది .రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం వారి సలహాలతో ముందుకు వెళ్తానని పూజా తెలిపారు. అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు, మందలపల్లి ప్రముఖులు అడప లచ్చయ్య దొర ని కలిసి వారి సలహాలు తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో దమ్మపేట సొసైటీ మాజీ డైరెక్టర్ వాసం శ్రీనివాసరావు, మారిబోయిన హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: