శ్రీనన్న జన్మదినం సందర్భంగా శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు..
👉 మెగా రక్తదాన శిబిరంలో శ్రీనన్న అభిమాని ధారావత్ రాంబాబు..
మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బాధలో ఉన్న కుటుంబాలకు బాసటగా నిలుస్తూ, తనను కలిసే ప్రతి ఒక్కరిని అన్నా అక్క అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ, కష్టాల్లో ఉన్న వారికి కొండంత ఓదార్పునిస్తూ, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు శ్రీనన్న గా పిలుచుకునే అలుపెరగని శ్రామికుడు జనం కోసం జన్మించిన ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా జూలూరుపాడు మండల కేంద్రంలోని శ్రీ సాయి బాబా ఆలయం నందు శీనన్న అభిమానులు గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఖమ్మం పట్టణంలోని శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో శ్రీనన్న అభిమాని ధారావత్ రాంబాబు రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నాగరాజు, బాలాజీ, రామారావు, సాయి కుమార్, చరణ్, లక్ష్మీనారాయణ, సామ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: