మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ శివారు భీమ్లా తండా లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. గూగులోత్ శ్రీనివాసరావు హరిత దంపతుల కుమారుడు గూగులోత్ రిషిత్ కుమార్ (2) ముక్కుపచ్చలారని పసి బాలుడు ఇంటి ఆరుబయట ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. తండ్రి పొలం పనులకు పోగా, తల్లి ఇంటి పనులు చేస్తుండగా, తన నాయనమ్మ దగ్గర ఆడుకుంటున్నాడనుకున్న, తల్లి, ఇరువురు ఏమర పాటు తనంతో ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి ఆవరణంలో నీటి కోసం వరలతో లోతైన గుంతలు నేల మట్టంగా ఏర్పాటు చేసుకొని, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి విషాద సంఘటనలు జరుగుతున్నాయి. అభం శుభం తెలియని బుడిబుడి నడకల చిన్నారుల పాలిట మృత్యు ద్వారాలుగా మారుతున్నాయి. మండల వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నప్పటికీ అధికారులు కానీ, గ్రామ పంచాయితీ పాలకులు కానీ, గ్రామాలలో అవగాహన కల్పించకపోవడం విశేషం. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామాలలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
Post A Comment: