CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్కారు నిర్ణయంతో చిగురించిన ఆశలు

Share it:

 


 పోడు భూములకు పట్టాలు ఇస్తానని కెసిఆర్ నిర్ణయించడంతో పోడు రైతుల్లో ఆనందం

 గుండాల అక్టోబర్ 6 (మన్యం మనుగడ) సర్కారు నిర్ణయంతో పోడు రైతుల్లో చిగురించిన ఆశలు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని కెసిఆర్ నిర్ణయించడంతో పోడు రైతుల్లో ఆనందం మొదలైంది. గుండాల ,ఆళ్లపల్లి మండలాల్లో గిరిజనులు, గిరిజనేతరులు పెద్ద మొత్తంలో పోడు వ్యవసాయం చేస్తున్నారు. గతంలో కొంతమందికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ హక్కు పత్రాలు వచ్చినప్పటికీ మిగిలిన వారికి ఇప్పటివరకు హక్కు పత్రాలు రాలేదు. తాజాగా సర్కార్ నిర్ణయంతో రైతులలో ఆనంద మొదలైంది గుండాల రేంజి పరిధిలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పటాలు 3527 కి ఉండగా పోడు భూమి 6520 ఎకరాలు గిరిజనుల ఆధీనంలో ఉన్నాయి. కాచన పల్లి రేంజి పరిధిలో 4,300 ఎకరాలకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పటాలు ఉండగా 25 వేల ఎకరాలు రైతుల ఆధీనంలో ఉన్నాయి. ఆళ్ల పల్లి రేంజి పరిధిలో పన్నెండు వందల ఎకరాలకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పటాలు ఉండగా ఏడు వేల ఎకరాలు గిరిజనులు గిరిజనేతరుల వద్ద సాగులో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో పట్టాలు వచ్చినట్లయితే రెండు మండలాల్లో ఉన్న గిరిజనులు గిరిజనేతరులకు భూముల సమస్యలు తీరినట్టే

Share it:

Post A Comment: