CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చేపల చెరువు కమిటీలకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం 🐟🐟🐟

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం(అక్టోబర్-06):: చేపలను జీవనాధార వృత్తిగా ఆధారం చేసుకుని జీవించే మత్స్యకారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.73 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని మత్స్యశాఖ జిల్లా అధికారి వరదారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు చండ్రుగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో చేపల చెరువు కమిటీలకు, పంచాయతీ బాధ్యులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చేప పిల్లల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరద రెడ్డి మాట్లాడుతూ... ఇప్పటి వరకు జిల్లాలో 700 చెరువుల్లో చేపపిల్లలను పెంచుతున్నారని. ప్రస్తుతం 97 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందని, జిల్లాలో శాశ్వత నీటి వనరులు ఉన్న 37 చెరువులను గుర్తించామని. చండ్రుగొండ మండలంలో 16 చెరువుల్లో చేప పిల్లలను పెంచడం జరుగుతుందని, చేపలను జీవనాధార వృత్తిగా చేసుకొని జీవించే మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎంపీపీ-బానోత్ పార్వతి, ఎంపీటీసీ లు-దారా బాబు, భూక్య రాజీ, సర్పంచ్-మలిపెద్ది లక్ష్మీ భవాని, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఎంపీడీవో-అన్నపూర్ణ, ఎంపిఓ- తోట తులసి రామ్, టిఆర్ఎస్ పార్టీ చండ్రుగొండ మండల కార్యదర్శి-ఉప్పతల ఏడుకొండలు, టిఆర్ఎస్ పార్టీ చండ్రుగొండ మండలం ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గుంపెన వైస్ చైర్మన్-మేడా మోహన్ రావు, బానోత్ బీలు, వంకాయలపాటి బాబురావు,దారా రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: