(కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు)
మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం(అక్టోబర్-06):: యువకుడు అదృశ్యమైన సంఘటన చండ్రుగొండ మండలంలో బుధవారం నాడు వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే తిప్పనపల్లి గ్రామానికి చెందిన 25 సంవత్సరాలు వయస్సు గల యువకుడు ధరావత్ క్రిష్ణ. మంగళవారం నాడు పొలం పనులకు వెళ్లి,సాయంత్రం ఇంటికి చేరుకోలేదని. కృష్ణ ద్విచక్ర వాహనం మరియు ఫోన్ బ్యాటరీ, సిమ్ కార్డులను రాత్రి సమయంలో తిప్పనపల్లి తండా ప్రధాన సెంటర్లో కుటుంబ సభ్యులు గమనించారని. స్నేహితులను బంధువులను విచారించిన ఆచూకీ లభ్యం కాలేదని, బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని సమాచారం. కృష్ణ అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: