👉 పోడు భూములు సాగు చేస్తున్న ప్రతి ఒక్కరికి పట్టాలివ్వాలి
👉 రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎన్డీ జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి.
మన్యం మనుగడ/ప్రతినిది:ములకలపల్లి మండలం:సీపీఐ ఎమ్ ఎల్ న్యూడెమోక్రసీ ములకలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టి కార్యాలయం లో పోడు భూముల సమస్యలపై పార్టి మండల కార్యదర్శి కల్లూరి కిషోర్ అద్యక్షతన సదస్సు జరిగింది.ఈ సదస్సులో పార్టి జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ సాగులో వున్న ప్రతి ఎకరాకు పోడు భూములకు పట్టాలివ్వాలని,పట్టాలిచ్చి రైతు బందు,రైతు భీమ లాంటి ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు.ఇప్పటికె పోడు వ్వవసాయం చేస్తున్న గిరిజన రైతులు అనేక పోరాటాలు చేసిన ఫలితంగానే ప్రభుత్వంలో కదిలిక వచ్చిందని,అయినప్పటికీ కూడా ఇప్పటికి వరకు పోడు భూముల సమస్యల పరిష్కరానికి సంబందించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోగా ప్రజలలో అనేక అనుమానాలు వున్నాయని అన్నారు.అందుకే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో పార్టి జిల్లా నాయకులు ముద్దా బిక్షం,డివిజన్ కార్యదర్శి అమర్లపుడి రాము.నూప భాస్కర్,పోతుగంటి లక్ష్మణ్ డివిజన్ నాయకులు,కుంజ కృష్ణ,నూపా సరోజని,గంగారం ఎంపిటిసి మడకం విజయ,గుండాలపాడు సర్పంచ్ కారం కుమారి.గుట్టగూడెం సర్పంచ్ సడియం అక్కమ్మ,రాచన్నగూడెం ఉప సర్పంచ్ వగ్గెల వెంకటేష్,తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: