CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దిగజారుతున్న మనిషి..!

Share it:

 


పత్తి పంటను పీకేసిన గుర్తుతెలియని వ్యక్తులు..


మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని సాయిరాం తండాలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రెండు ఎకరాల పత్తి పంటను పీకి వేసిన సంఘటన జరిగింది. సాయిరాం తండా గ్రామానికి చెందిన వాంకుడోత్ హనుమ రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేస్తున్నాడు. పత్తి ఏపుగా పెరిగి పూతలు, కాయ దశలో ఉన్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు పంటను మొత్తం పీకేశారు. ఆరుగాలం చాకిరీ చేసి, పెట్టుబడి పెట్టి, కంటికి రెప్పలా కాపాడుకున్న పంటచేనును చూసి ఆ కౌలు రైతు కుటుంబం బోరున విలపించారు. ఏవైనా వ్యక్తి గత తగాదాలు ఉంటే పరిష్కరించుకోవాలి కానీ, ఇలా పంటలపై నీచమైన చర్యలకు పాల్పడడం మనిషి దిగజారుడుతనానికి నిదర్శనం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share it:

Post A Comment: