CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి గుండాల సర్పంచ్.

Share it:


అక్టోబర్ 30( మన్యం మనుగడ) మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న పంట తో పాటు ఇతర పంటలను కూడా కొనుగోలు చేయాలన్నారు. పత్తి, మొక్కజొన్న , వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. సీసీఐ ద్వారా కొనుగోలు చేసే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామక్క , గుండాల సర్పంచ్ సీతారాములు, పీ వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, అరెం నరేష్ , వై వెంకన్న , పెంటన్న , మంగన్న , తదితరులు పాల్గొన్నారు
Share it:

TELANGANA

Post A Comment: