శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ నందు నేతకాని సంఘం పినపాక మండల అధ్యక్షుడు గుమాసు గోవర్ధన్ అధ్యక్షతన ఏజెన్సీ ప్రాంతంలో తరతరాలుగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారానికిగాను పినపాక నియోజకవర్గ స్థాయి దళిత సంఘాల ఐక్య వేధిక ఏర్పాటుపై చర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు దేవంగి రమణయ్య మాదిగ మాట్లాడుతూ దేశంలో , రాష్ట్రంలో 85% దళితులు, గిరిజనులు, ముస్లిం బహుజనులు ఉండి కేవలం 15% ఉన్న అగ్ర కులాల చేతుల్లో అధికారాన్ని పెట్టడం అంబేడ్కర్ గారి ఆశయాలను పక్కకు పెట్టడం అవుతుందని అన్నారు. కాబట్టి దళిత , గిరిజన, బహుజన సంఘాలన్నీ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతకాని సంఘం నాయకులు జిమ్మిడి శివశంకర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. కాబట్టి దళిత సమస్యల పరిస్కారం కోసం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళిత సంఘాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో నేతకాని సంఘం రాష్ట్ర నాయకులు జాడి లక్ష్మయ్య, గుమాస్ లక్ష్మణ్, జాడి వెంకటేశ్వర్లు, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఇసంపల్లి కృష్ణ ,బోయిన వెంకటేశ్వర్లు , వల్లెపోగు వెంకటేశ్వర్లు, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి చిట్యాల రజిత, నేతకాని సంఘం పినపాక మండల ప్రధాన కార్యదర్శి జాడి రాంబాబు ఆర్ఎంపి,సహాయ కార్యదర్శి జాడి కిరణ్ , బేడ బుడగ సంఘం నాయకులు గంజాయి మారయ్య, ఉశకెల కొండయ్య,బోయిళ్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: