మన్యం టీవీ ఏటూరు నాగారం: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న గిరిజన స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కి మేడారంలోములుగు నియోజకవర్గ అన్నిమండలాల అధ్యక్షులు పుష్ప గుచ్చం అందించి శాలువాతో సన్మానం చేసి ఘనంగా స్వాగతం పలికిన వారిలో ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్,వెంకటాపూర్ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి,ఏటూరునాగారం మండల అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్,తాడ్వాయి మండల అధ్యక్షుడు నుషేట్టి రమేష్,గోవిందరావుపేట మండల అధ్యక్షుడు సూరపనేని సాయి బాబా, మంగపేట మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ గార్లు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి ఆదివాసి సాంప్రదాయాలతొ మంత్రి సత్యవతి రాథోడ్ వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గిరిజన పూజారులు,దేవాదాయ శాఖ అధికారులు.ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: