మన్యం టీవి, అశ్వాపురం:
అశ్వాపురం మండలం తురుమలతండా,గొందిగూడెం గ్రామంలో
ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సీతరామపురం గ్రామ పంచాయితీ ఇంచార్జ్ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశం కొరకు ప్రజా ప్రతినిధులు,నాయకులు,పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని అలాగే నవంబర్ 15 తారీకున వరంగల్ లో జరగనున్న విజయగర్జన సభకు కార్యకర్తలు అందరూ భారీగా హాజరు కావాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఇస్లావత్ కమల,పాయం భద్రమ్మ,తెరాస మండల యువజన అధ్యక్షులు వలబోజు మురళీకృష్ణ,మండల Bc సెల్ అధ్యక్షులు బొబ్బాల నాగేశ్వరరావు,మండల ప్రచార కార్యదర్శి పొడియం అనిల్,గ్రామ పంచాయితీ అధ్యక్షులు Md జిలానీ,ఉప్పనూతుల మహేష్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: