మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామం ఎస్సీ కాలనీ కి చెందిన కొప్పుల కృష్ణ(33) అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందాడు. ఆ కుటుంబానికి.పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి దశదిన కర్మలకు మంగళవారం 50 kg ల బియ్యం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దళిత బిడ్డలు ఏ ఆపదలో ఉన్న నేనున్నా అనే భరోసా కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల సాగర్,సంపత్, నాగేశ్వరరావు,విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: