👉 100శాతం లక్ష్యంగా వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది
👉 పర్యవేక్షిస్తున్న ఎం పీ ఓ వలి
గుండాల అక్టోబర్ 12 (మన్యం మనుగడ) ఊరు అయినా పొలం అయినా వారి వద్దకే కరోనా వ్యాక్సిన్. మండలంలో కరోనా వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన వేస్తున్నారు. మండలం పరిధిలోని ముత్త పురం గ్రామంలో ఏఎన్ఎం భువనేశ్వరి కరోనా వ్యాక్సిన్ పొలాల వద్ద కు వెళ్లి వారికి వేస్తుంది. స్థానిక వైద్యులు రవిచంద్ సిబ్బందితో కలిసి దామర తో గు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరోనా కరోనా వ్యాక్సిన్ వేశారు. మండలంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించే విధంగా కార్యక్రమాన్ని స్థానిక ఎం పీ ఓ వలి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దామర తోగు సర్పంచ్ సుతారి సరోజిని, ఆర్ఐ నాగేశ్వరరావు, ఎంపీటీసీ కృష్ణారావు , పంచాయతీ సెక్రెటరీ రామ్మోహన్, వీఆర్ఏ సారయ్య , వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: