మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో గ్రామాలకు పంపిణీ
మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని 35 చెరువులు, కుంటలకు పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో మత్స్యశాఖ చేపపిల్లలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారి వరదా రెడ్డి పాల్గొని మండలంలోని అన్ని గ్రామాలలో గల చెరువులకు చేప పిల్లలను అందజేయడం జరిగింది.ప్రతి గ్రామ పంచాయతీలలో సర్పంచుల ఆధ్వర్యంలో చేప పిల్లలను చెరువులు కుంటలలో జార చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, పినపాక మండల కో ఆప్షన్ సభ్యులు జహంగీర్, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, జానంపేట ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ, మత్స్య శాఖ క్షేత్ర అధికారి కోటేశ్వరరావు, సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Post A Comment: