భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 4 (మన్యం టీవీ)
సింగరేణి సి&ఎండి ఎన్ శ్రీధర్ , ఐఏఎస్ సోమవారం నాడు సింగరేణి భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జిఎంలతో సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా ఉత్పత్తి, ఉత్పాదకత, ఓబి వెలికితీత పనులను మరియు రవాణా గురించి తీసుకొనవలసిన చర్యలను వివరించారు. అదే విధముగా మిగిలిన ఆర్ధిక సంవత్సరములో చేయవలసిన ఉత్పత్తి, ఉత్పాదకత, ఓబిర వెలికితీత పనుల గురించి బొగ్గు రవాణా గురించి సమీక్షించారు. ఈ సమీక్షలో ఏరియా జిఎం సిహెచ్ నరసింహ రావు తో పాటు, ఇంచార్జ్ ఎస్ఓటు జిఎం రమేష్, ఏరియా ఇంజనీర్ రఘు రామి రెడ్డి, ప్రొజెక్ట్ ఆఫీసర్లు, గనిమేనేజర్లు, ప్రొజెక్ట్ ఇంజనీర్లు, వివిధ శాఖల అధిపతులు పాల్గొన్నారు.
Post A Comment: