👉మండల విద్యాశాఖ అధికారి ఆదేశించిన ఎమ్మెల్యే మెచ్చా
👉 టి.ఆర్.ఎస్.విమండల అధ్యక్షులు కిట్టు యాదవ్ వినతికి స్పందించిన ఎమ్మెల్యే
మన్యం టీవి,ములకలపల్లి : రాజుపేట కాలనీలో గల స్కూల్ లో ఉపాద్యాయులు సరిపోని కారణం చేత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సమస్యను టి.ఆర్.ఎస్.విమండల అధ్యక్షులు కిట్టు యాదవ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి,అధికారులతో మాట్లాడటం అలాగే వారం రోజుల్లో ఉపాధ్యాయుడినీ ఏర్పాటు చేస్తాం అని తెలుపడం జరిగింది.ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన మండల టి ఆర్ ఎస్ వి. అధ్యక్షుడు కృష్ణ నీ అభినందిస్తున్నానని,ఇలాగే అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎలాంటి సమస్య ఉన్న కూడా మా దృష్టికి తీసుకురావాలని వెంటనే వాటిని పరిష్కరించుకునే విధంగా కృషి చేద్దామని తెలియజేయడం జరిగింది.
Post A Comment: