మన్యంటీవి, అశ్వారావుపేట:ఎమ్మెల్యే మెచ్చా ఆదేశాల మేరకు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దాది కాంతమ్మ అనే మహిళను పరామర్శించిన అశ్వారావుపేట మండల యువజన విభాగం అధ్యక్షుడు సోమని శ్రీను. దాది కాంతమ్మ వైద్యానికి ఒంటరి ఆదివాసి మహిళ అప్పన్న హస్తం కోసం ఎదురుచూపులు అనే గురువారం ప్రచురించినా మన్యంటీవి వార్త పై తక్షణమే స్పందించిన అశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు ముందుకొచ్చి ఆ మహిళా వైద్యానికి పూర్తి ఏర్పాట్లు చేస్తాం అని భరోసా కల్పించి శుక్రవారం అశ్వారావుపేట మండల యువజన విభాగం అధ్యక్షుడు సోమని శ్రీనునీ పూర్తి సమాచారం తెలుసుకోమని ఆదేశించారు. అందులో భాగంగా అశ్వరావుపేట యువజన విభాగం అధ్యక్షుడు శ్రీను బాధిత మహిళ వద్ద కి వెళ్లి ఆ మహిళను పరామర్శించి వివరాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత మహిళ తన గోడును బాహ్య ప్రపంచానికి తెలియపరిచిన మన్యంమీడియాకి, మానవత్వంతో స్పందించి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట యువజన విభాగం ఉపాధ్యక్షుడు అల్లూరి నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ సోమిని శివ శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: