CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా లాక్ డౌన్ ప్రభావంతో గిరిజన విద్యార్థిని,విద్యార్థులు చదువులు అస్తవ్యస్తం 📚📘📚📒📚📗📚📕

Share it:

 


👉రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారం తో పాటు నాణ్యమైన విద్యను అందించాలి - ఏటీఎఫ్ వినతిపత్రం

మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం (అక్టోబర్-14)::అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ను మండలంలోని తాటి సుబ్బన్నగూడెం గ్రామంలోని వారి స్వగృహంలో అదివాసీ టీచర్స్ ఫెడరేషన్ (ఏటిఎఫ్) నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి విన్నతి పత్రాన్ని అందించారు.ఈ సంధర్భంగా ఏటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ కరోనా మహంమ్మరి ప్రభావం వలన దేశంలో విధించిన లాక్ డౌన్ తో 19 నెలలు గా పాఠశాలలు ముసివేయటం వలన గిరి విద్యార్థిని, విద్యార్థుల చదవులు అస్తవ్యస్తంగా ఉన్నాయని.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చోరవ తీసుకుని సెప్టెంబర్ మాసం నుంచి పాఠశాలలు తెరవటం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలను,వసతి గృహాలను కూడా తెరచి గిరిజన విద్యార్థిని,విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేయాలని కోరారు.

Share it:

Post A Comment: