మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో సోమవారం రోజున పూస స్వామి అనే వ్యక్తి పనికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. పూస స్వామి కుటుంబానికి కనీసం వైద్యం చేయించుకోవాడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల వారు సోషల్ మీడియా ద్వారా సహాయాన్ని కోరుతూ సమాచారాన్ని తెలియజేశారు. విషయం తెలుసుకున్న మానవ సేవ యూత్ వారు వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం తమ వంతు ఆర్థిక సహాయాన్ని , కుటుంబ పోషణ నిమిత్తం 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు పుల్లూరు శ్రావణ్ కుమార్, మానవ సేవ యూత్ అధ్యక్షులు జూపూడి సుబ్బారావు, మానవ సేవయుత్ ప్రధాన కార్యదర్శి శెట్టిపల్లి ముకుందం, సహాయ కార్యదర్శి బోడ ప్రవీణ్, ఉపాధ్యక్షుడు గాంధర్ల సంతోష్, సేవా సారథులు దుర్గ నరసింహారావు, ఎర్ర శ్రావణ్కుమార్ , చౌలం వేణు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: