మన్యంటీవి, అశ్వారావుపేట:మండలంలోని స్థానిక రైతు వేదికలో మండల రైతులతో అవగాహన సదస్సునీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులు అందరు కూడ వరి పంట సాగు తగ్గించి దాని స్థానంలో వేరే పంటను ప్రత్యమ్యంగా వేసుకోవాలని, అలాగే రైతులు ఫామ్ ఆయిల్ మరియు కొబ్బరి మొక్కలు కావాలని అడగటం జరిగిందని, వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి కలెక్టర్కి తెలియజేసి మొక్కలు ఇచ్చే విధంగా చూస్తా అని రైతులకు వారు తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అగ్రికల్చర్ ఏఓ నవీన్, ఏఈఓ రాయుడు, ఫామ్ ఆయిల్ ఎస్ఎస్వి, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: