CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

క్షేత్ర పరిశీలన చేసిన జిల్లా వ్యవసాయ బృందం

Share it:

 


పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు


మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఆదర్శ రైతులు అవలంబిస్తున్న నూతన వ్యవసాయ విధానాలను పరిశీలన చేయుటకు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో పరిశీలన బృందం పినపాక మండలంలోని వివిధ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. జానంపేట గ్రామంలో వెల్లంకి నరసింహారావు కొనసాగిస్తున్న బెంగాలీ నాటు విధానాన్ని, పసుపు పంట పండించే విధానాన్ని పరిశీలించి శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం పీ కొత్తగూడెం గ్రామంలో కాట్రగడ్డ రవీంద్రనాథ్ పండిస్తున్న నల్లబియ్యం పంట విధానాన్ని పరిశీలించి, ఆ పంట వేయడం వలన కలిగే లాభాలను గురించి జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు వివరించడం జరిగింది. అనంతరం గుండెల గ్రామ సమీపంలో కంది సుబ్బారెడ్డి సాగు చేస్తున్న, వ్యవసాయ విధానాన్ని పరిశీలించి అభినందనలు తెలియ జేయడం జరిగింది. అదేవిధంగా ఏడూళ్ల బయ్యారం గ్రామంలో యువ రైతు సుబ్బారెడ్డి సాగు చేస్తున్న డ్రమ్ సీడర్ కం ఫెర్టిలైజర్ వ్యవసాయ విధానాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు మాట్లాడుతూ, ఎరువుల దుకాణదారులు రైతులు వారి పంటల గురించి తెలియజేసిన సమస్యల గురించి సరైన అవగాహన లేక సంబంధం లేని పురుగుమందులను ఇవ్వడం కారణంగా రైతులు నష్టపోతున్నారని, దానికోసం అని మండలంలోని ఎరువుల దుకాణం యజమానులకు క్షేత్ర పరిశీలన ద్వారా శిక్షణ అందిస్తున్నామని, దీని ద్వారా రాబోయే కాలంలో నాణ్యమైన పంట దిగుబడి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు డివిజనల్ వ్యవసాయ సహాయ సంచాలకులు తాతారావు, వ్యవసాయ విస్తరణ అధికారి గమనం లక్ష్మణరావు, ఎరువుల దుకాణం యజమానులు, క్షేత్ర పరిశీలన సభ్యులు, రైతులు పాల్గొనడం జరిగింది.

Share it:

Post A Comment: