గుండాల ఎంపీపీ ముక్తి సత్యం
గుండాల అక్టోబర్ 1 (మన్యం మనుగడ) కుల రక్కసి ని కూకటివేళ్లతో తొలగించాలని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే నూట నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం సత్యశోధక్ సమాజ్ సంస్థను స్థాపించి కుల రక్కసి పై ఉద్యమించాలన్నారు. కుల రక్కసి దిష్టిబొమ్మను మా పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశామన్నారు. పూలే అనేక సామాజిక కార్యక్రమాలలో కుల వివక్షతకు గురవుతున్న వారికి అండగా నిలిచారన్నారు. 70 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో నేటికి కుల వివక్షత త్వరగా లేదన్నారు. ప్రతి ఒక్కరు కులవివక్షత కై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి వై ఎస్ నాయకులు పరిష్కా రవి, సబ్ డివిజన్ కార్యదర్శి ఆరెం నరేష్ , బచ్చల సారన్న , పెంటన్న, ఈ సం మంగన్న , దుగ్గి రియాజ్, ఈ సం కృష్ణ , సుతారి భాస్కర్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: