మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం(అక్టోబర్-20):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం,లింగాలపల్లి గ్రామంలో "కొమరం భీమ్" 81 వ వర్దంతి వార్షికోత్సవం ను ఆదివాసి జేఏసి దమ్మపేట మండల అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వర్ధంతి వార్షికోత్సవంలో పాల్గొన్న పలువురు ఆదివాసి నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ ఆరాధ్యుడు,ఆదివాసీ బొబ్బిలి,స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్, ఆదివాసీ (గోండ్) జాతి కి చేసినా సేవలను గురించి కొనియాడారు. ప్రధానంగా కొమరం భీమ్ నిజాం నిరంకుసత్వ పరిపాలనకు వ్యతిరేకంగా (జల్-జంగల్-జమీన్) నినాదంతో పోరాటం చేసి తన ప్రాణాలు సైతం జాతి కోసం అర్పించిన మహనీయుడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తాటి పోతురాజు,పాశం వెంకటేశ్వరరావు,మడకం ప్రసాద్, సొడెం రామ్మూర్తి సాయి,లింగాలపల్లి గ్రామ పెద్దలు చాపా రాఘవయ్య,వాడే శ్రీను,కుంజా భాస్కర్,బండారు ఆలేఖర్,బుద్దుల రాంబాబు,వాడే రంగయ్య,సోయం సత్యనారాయణ,అశ్వారావుపేట నియోజక వర్గ ఆదివాసీ విద్యార్థి నాయకుడు వాడే వీరాస్వామి, తధితరులు పాల్గొన్నారు.
Post A Comment: