మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అక్టోబర్ 8న షెడ్యూలు కార్మికుల సమ్మె లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొంటున్నారు.సమ్మె నోటీసు ను సింగరేణి జనరల్ మేనేజర్ మల్లెల సుబ్బారావు గారికి సీఐటీయూ ఇల్లందు ప్రాంతీయ కన్వీనర్ అబ్దుల్ నబి,సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం నేత ఆలేటి కిరణ్ కుమార్,రాజేష్,యాసిన్,మల్లయ్య తదితరులు జీ ఎం గారికి సమర్పించారు.అంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో 73రకాల షెడ్యూల్ కార్మికులకు వేతన పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీ ఓ విడుదల చేసి ఎండ్లు గడుస్తున్నా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయక పోవడం వల్ల కార్మికులు వేలాది రూపాయలు నష్టపోతున్నారని అన్నారు.
Post A Comment: