మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, పాత మామిళ్లవారిగూడెం లో రెండు రోజుల క్రితం విద్యుత్ తీగలు తెగి కోమటి మహేశ్వరావు పూరిల్లు మీద పడటంతో పూర్తిగా ఇల్లు కాలిపోయింది. జూపల్లి యువసేన సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న జూపల్లి రమేష్ తక్షణమే ఇల్లు కాళీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కుటుంబానికి నిత్యావసర సరుకులు, 25కేజీల బియ్యం, వంట సామాగ్రి, 5000 రూపాయలు ఆర్ధిక సాయం బాధిత కుటుంబానికి జూపల్లి రమేష్, జూపల్లి యువసేన సభ్యులను ద్వారా ఇయ్యటం జరిగింది. మరియు కొనకళ్ల సత్యనారాయణ (మేఘ ఇంజనీర్ &బీహార్ ప్రాజెక్ట్ సైట్ ఇంచార్జ్) ఫోన్ లో సమాచారం తెలుసుకొని బాధితుల కుటుంబానికి తన వంతు గా బియ్యం కట్ట, నిత్యావసర సరుకులు ఇవ్వమని జూపల్లి సభ్యులకు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా జూపల్లి యువసేన సభ్యులు మాట్లాడుతూ ఇల్లు కాళీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీరికి అందినంత వరకు సాయాన్ని చేయాలి అని జూపల్లి రమేష్ కి తెలియచేయగా విషియం తెలుసుకున్న వెంటనే ఆర్ధిక సాయం అందిoచారు. అ పరిధిలోని ఏ విషియం జరిగిన తమకు తెలియ చేయాలి అని, నా వంతు ఎప్పుడు సాయం ఉంటుంది అని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆయా పార్టీల కార్యకర్తలంతా అందుబాటులో ఉంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జుజ్జురి రాంబాబు, తెరాస గ్రామ సేఖ అధ్యక్షులు బొల్లుకొండ చెన్నారావు, మండల తెరాస ఉపాధ్యక్షులు పల్లెల రామలక్మయ్య, యూత్ లీడర్ నాగ కిషోర్, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు తరుణ్ తేజ, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ జుజ్జురి మనోహర్, తెరాస కార్యదర్శి జుజ్జురి వెంకన్నబాబు, మాజీ సర్పంచ్ సున్నం రామలక్మయ్య, అనిల్, పవన్, ఉమామహేశ్వరావు, ధనేయలు, వార్డ్ నెంబర్ రెడ్డిమళ్ల నరేంద్ర, మండల యువజన తెరాస ఉపాధ్యక్షులు శ్రీనివాస్, యాసిన్ పాషా, సలీమ్, రాము, వినయ్, ఈశ్వర్, మడకం వంశీ, దాసరి సాయి, చెన్నరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: