మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 23, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడo నరసింహారావు అధ్యక్షతన మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శనివారం నిర్వహించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ఆదేశానుసారం ఈనెల 25న జరిగే టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ధి ఉత్సవాలకు సంబంధించి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలోముఖ్యఅతిథిగా ఎంపీపీ లావుడ్యా సోని పాల్గొని మాట్లాడుతూ.. ఈ నెల 25న హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్లో జరిగే టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ని విజయవంతం చేయాలని, అదేవిధంగా నవంబర్ 15 న వరంగల్ లో జరిగే విజయ గర్జన సభకు జూలూరుపాడు మండలంలోని ప్రతి పల్లె నుండి టిఆర్ఎస్ కార్యకర్తలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల కోఆర్డినేటర్ యదళ్ళపల్లి వీరభద్రం, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే లతీఫ్, ఏఎంసి వైస్ చైర్మన్ చింత జగన్నాధం, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, జిల్లా రైతుబంధు కమిటీ సభ్యులు వేల్పుల నరసింహారావు, ఉద్యమకారులు శ్రీనాధ రాజు నాగరాజు, ఏఎంసి డైరెక్టర్లుహలవత్ నరసింహారావు,సపవత్ నరేష్, సర్పంచులు గుగులోత్ రాందాస్, లావుడ్యా కిషన్ లాల్, బాదావత్ లక్ష్మి, బోడ బొజ్య, బేతాళ పాడు ఎంపీటీసీ వాడ వెంకట నరసమ్మ, సీనియర్ మండల నాయకులు రామి శెట్టి రాంబాబు, రామిశెట్టి నాగేశ్వరావు, తోట శ్రీను, కాజా రమేష్, మోదుగు రామకృష్ణ, పోతురాజు నాగరాజు, ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ యూత్ విద్యార్థి మహిళా అధ్యక్షులు పణితి వెంకటేశ్వర్లు, బానోత్ ధర్మ, అల్లాడి లింగారావు, ఎస్ కె సుభాని, గుగులోత్ చంటి నాయక్, బానోత్ బాలాజీ, ఎస్ కే ఫారిన బేగం, నాయకులు లేళ్ల గోపాల్ రెడ్డి, బోడ నాగరాజు, మాడుగుల నాగరాజు, ముదిగొండ రమేష్, భూక్యా లచ్చిరాం, గంగవత్ శ్రీను, మహేష్, దారావత్ రాంబాబు, గుగులోత్ బాలాజీ, దారావత్ లక్ష్మి నారాయణ, గుగులోత్ రాంబాబు, బాధవత్ సక్రు, చప్పిడి ప్రసాద్,బానోత్ హతి రామ్, దారావత్ రాంజీ,బోడ బాబులల్, ఎస్.కె మైబు,టిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుగులోత్ రాంబాబు మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: