అన్ని దానాలలో కెల్లా విద్యా దానం ఉన్నతమైనదని ఆ దిశగా బాలికలవిద్య కి తోడ్పాటు అందించి రేపటి తరానికి మార్గదర్శకాలుగా తయారుచేయడానికి కృషి చేస్తున్న జేడీ పౌండేషన్,ఇప్పటికే ఇంటర్మీడియట్ ఒకేషనల్ లో అత్యధిక మార్కులు సాధించిన గంగాభవాని అనే విద్యార్థిని దత్తత తీసుకుని వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ లో చదివిస్తున్న విషయం తెలిసిందే అలాగే భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పేద బాలికల కు స్మార్ట్ఫోన్లు,నోట్ బుక్స్, ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా పినపాక పట్టి నగర్ గ్రామానికి చెందిన తలారి తిరుపతి గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అతనికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారి దయనీయ పరిస్థితి తెలుసుకుని ఆ పిల్లలకి చదవడానికి తమ వంతు బాధ్యతగా ఈ రోజు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరు పిల్లలకు అవసరమైన నోట్ బుక్స్ ని పౌండేషన్ సభ్యురాలు శ్రీమతి హన్సి పవన్ చేతులమీదుగా చిన్నారి స్నిగ్ధ మరియు ఆమె తల్లి శ్రీమతి మంజుశ్రీ కి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీమతి మంజు అడిగిన వెంటనే తమకు పిల్లల విద్య కు సహకరించిన జెడి ఫౌండేషన్ భాద్యుడు శ్రీ మురళీ మోహన్ కుమార్ కి మరియు పౌండేషన్ టీం కి కృతజ్ఞతలు తెలిపారు.
Navigation
Post A Comment: