CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రూ.22 లక్షల రూపాయలతో జటాయు వాహనాన్ని ప్రారంభించిన విప్ రేగా:హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Share it:

 

విప్ రేగా అభివృద్ధి మంత్రం


స్వచ్ఛ మణుగూరు పట్టణమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు








మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు అంబేద్కర్ సెంటర్ లో శుక్రవారం మున్సిపాలిటీ లోని నూతన వాహనం అయినటువంటి జటాయు వాహనం ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు చేతుల మీదుగా    ప్రారంభించారు.మణుగూరు మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి సారించిన విప్ రేగా,మున్సిపల్ సిబ్బంది,మరియు ఇతర సమస్యల ను సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి వివరించిన వెంటనే రూ.22 లక్షల రూపాయల తో అధునాతన టెక్నాలజీ తో ఏర్పాటు చేసిన జటాయు వాహనం చెత్తను సేకరించే యంత్రాన్ని మంజూరు చేసారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలు,పట్టణాలు అభివృద్ధి చెందునున్నాయి అన్నారు. మణుగూరు లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలే అందుకు నిదర్శనం అని తెలిపారు.అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామని,రాబోయే కాలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా నే అభివృద్ధి సాధ్యం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి, జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి రావు,మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్,ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,కార్యదరర్శులు రాంరెడ్డి,నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, మండల యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,రుద్ర వెంకట్, టిఆర్ఎస్ నాయకులు వట్టం. రాంబాబు,ఎడ్ల శ్రీను, ముద్దంగుల కృష్ణ,మహిళ అధ్యక్షురాలు చంద్రకళ, రమాదేవి,మహిళ కార్యకర్తలు, యువజన నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: