గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 22 (మన్యం మనుగడ) పల్లె పల్లెకు టిఆర్ఎస్ జండా ఉంటుందని పాయం నరసింహారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో టిఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది అన్నారు. రానున్న రోజుల్లో కారు జోరు మరింతగా పెరిగి అన్ని ఎన్నికల్లో గెలుపు ఢంకా మోగిస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి హనుమంతరావు, కార్యదర్శి బాబా, కోపరేటివ్ చైర్మన్ రామయ్య , మైనార్టీ నాయకులు ఆదాం, సర్పంచులు, ఎంపీటీసీలు , కోపరేటివ్ డైరెక్టర్స్ , పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post A Comment: