CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నవంబర్ 1న కలెక్టరేట్ ముందు ధర్నాను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చిన ఆదివాసీ సంక్షేమ పరిషత్..

Share it:

 



👉 అభ్యుదయ భవనంలో సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ..


మన్యం టీవీ : పాల్వంచ అక్టోబర్ 17, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండల కేంద్రంలోని ఆదివాసి అభ్యుదయ భవనంలో ఆదివారం బట్ట కనకరాజ్ అధ్యక్షతన ఆదివాసీ సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగ బోయిన చంద్రయ్య దొర మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు సాగుచేస్తున్న పోడు భూములకు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల నుండి పోడు భూములను లాక్కోవడం ప్రభుత్వం మానుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి ట్రైబల్ రిలీజియన్ కాలం ఏర్పాటు చెయ్యలని అన్నారు. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం లోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 17 లో అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివెయ్యాలని కోరారు. జీవో నెంబర్ 3 ని 29 శాఖలలో ప్రభుత్వ జీవోలను పార్లమెంటులో చట్టం చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో గల ఏజెన్సీ నాన్ ఏజెన్సీ ప్రాంతాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న కలెక్టరేట్ ముందు ధర్నా ను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సోలం రామారావు, సున్నం రాము, సోయం సత్యనారాయణ, కన్నెబోయిన వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: