భద్రాద్రి కొత్తగూడెం,పినపాక, మన్యం టీవి, పినపాక:తెలంగాణ ప్రభుత్వవిప్ పినపాక శాసనసభసభ్యులు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు తోగ్గూడెం పంచాయతీలో తోగ్గూడెం గ్రామ అధ్యక్షులు డాక్టర్ రాజు , కొంపెల్లి మల్లేష్ ల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో తెరాస సీనియర్ నాయకులు బొలిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగే సభలను విజయవంతం చేయాలని కోరారు 27 వ తారీకున మణుగూరులోని హనుమాన్ ఫంక్షన్ హల్ నందు జరిగే నియోజకవర్గ సమావేశానికి గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త హాజరు కావాలని కోరారు. అలాగే నవంబర్ 15న వరంగల్ లో జరిగే విజయ గర్జన సభకు పంచాయతీ నుండి 1000 మంది కదలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుస్సి శ్రీనివాస్ రావు, పార్టీ నాయకులు కటకం గణేష్,వార్డ్ మెంబెర్స్ ఊడుగుల రామచంద్రు,కొంపెల్లి నాగేశ్వరావు,తాటి రామకృష్ణ, గంగరబోయిన రామకృష్ణ,గొగ్గల బజారు, కూనరపు రాము, కల్తి లక్ష్మయ్య,తాటి నర్సింహారావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: