CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి గ్రామ స్థాయి సమావేశం లో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు

Share it:



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని గుట్ట మల్లారం,తోగ్గుడెం, గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు స్థానిక ప్రజా ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశంను మండల అధ్యక్షులు ముత్యంబాబు అధ్యక్షత న ఏర్పాటైన చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మణుగూరు మండలం జడ్పిటిసి శ్రీ పోశం  నరసింహారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది అన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ స్దాపించి 20 సంవత్సరాలు పుర్తి అవుతున్న సందర్భంగా, వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చారన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.27వ తేదిన నియోజకవర్గ సమావేశం, నవంబర్‌ 15వ తేదిన వరంగల్‌లో జరిగే విజయ గర్జన సభలను పార్టీ నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలన్నారు.గ్రామ కమిటీ అధ్యక్షులు భాధ్యత తీసుకొని పని చేయాలన్నారు.స్దానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు.వరంగల్‌లో జరిగే విజయ గర్జన సభకు ప్రతి గ్రామం నుండి ఒక బస్సు ఉంటుందని,కార్యకర్తలు అందరూ హజరుకావాలన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం జడ్పీటీసీ పోశం. నరసింహారావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,ఎంపీటీసీ కణితి. బాబురావు,సర్పంచ్ లు ముత్తయ్య,రజిత,టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వట్టం రాంబాబు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు సమితి సింగారం ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్,స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు పప్పుల.ప్రసాద్, గువ్వ.రాంబాబు,రంగయ్య,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: