CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భారతీయ జనతా పార్టీ అద్వర్యం లో152 వ గాంధీ జయంతి వేడుకలు

Share it:

 



మన్యం టీవీ చర్ల:

 చర్ల మండలం గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు భారత జనతా పార్టీ సభ్యులు.చర్ల మండల భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శి నుప రమేష్ మాట్లాడుతు గాంధీ నిర్వహించిన అహింసా నవ ప్రపంచ సూత్రం ఈ రోజు కనబడటం లేదని అన్నారు. చౌరీ చౌరా ఘటన తరువాత గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయలనుకోవడం కారణం అది హింసాత్మకం కావడం ఒక్కటే కాదు ఆ హింసలో ఆయన భారతీయులు స్వతంత్యోద్యమ  స్ఫూర్తి ని అర్ధం చేసుకోవడంలో గందరగోళం లో ఉన్నారని గమనించారు. స్వాతంత్ర్య అంటే యజమాని హోదా పొందటమని వారు భావిస్తున్నట్లు గుర్తించారు. ఇతరుల పై పెత్తనం చేయడాన్ని ఒక హక్కు గా మార్చుకోవచని వారు అనుకుంటున్నట్లు ఆయన గమనించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నుప రమేష్, సరియం ధర్మరాజు, మడకం కృష్ణ అర్జున్, అశోక్, గోపాల సాయి, ప్రశాంత్, సురేష్, కణితి సోమరాజు, చింత సుధాకర్, సంతపురి సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: