మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు షెడ్యూల్ కార్మికులు, స్కీం వర్కర్ల కు కనీస వేతనం,ఉద్యోగ భద్రత,ఇన్సూరెన్స్, ఈ ఎస్ ఐ,పెన్షన్, పీ ఎఫ్ సౌకర్యాలు కల్పించాలని,రద్దుపర్చిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక స్టేషన్ బస్తీ లోనీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్మిక సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని సమర్పించారు.అనంతరం సీఐటీయూ మండల కన్వీనర్ ఆలేటి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ,ఇల్లందు ప్రాంతీయ కన్వీనర్ అబ్దుల్ నబి లు పాల్గొని ప్రసంగించారు.నాడు దేశ స్వతంత్రం కోసం,విదేశీయులను పారదొలదనికి గాంధీజీ ఉద్యమించి అనేక మంది ప్రాణ త్యాగం చేసి స్వతంత్రం తెచ్చుకుంటే నేడు 75 వసంతాల తర్వాత కార్మికుల,రైతుల వ్యతిరేక విధానాలకు తెచ్చి బడా కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వరంగ సంస్థలు అమ్మకానికి పెట్టిన బీజేపీ ప్రభుత్వం విదేయులకు దేశాన్ని తాకట్టు పెడుతున్నాడని అన్నారు. షెడ్యూల్ కార్మికుల సమస్య పరిష్కారం ,కనీస వేతనాలు సాధించడానికి అక్టోబర్ 8నపారిశ్రామిక సమ్మె చేయాలని కోరారు e సమావేశంలో నాయకులు తాళ్లూరి కృష్ణ,కిరణ్, ఈసం శ్రీలత, ఈసం పద్మ,చంద్రమ్మ,వాసం రాము,వాసం మాధవి, జమీల్ పాషా, వకీల్,ఇబ్రహీం,చోటు,నరేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: