మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి కొన్ని రోజుల క్రితం వాహన ప్రమాదం దానికి గురై కాలుకి దెబ్బలు తగలడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోగా, మంగళవారం రోజున ఆయన ఇంటికి తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు వెళ్లి పరామర్శించడం జరిగింది. అక్కడే ఇటీవల గుండెపోటుతో మరణించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కొత్తపల్లి సతీష్ కుటుంబానికి పదివేల రూపాయలను రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దశదినకర్మ ల నిమిత్తం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డా శ్రీనివాస రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగింది
Post A Comment: