మన్యం టీవీ కరకగూడెం: కరకగూడెం సబ్ స్టేషను లో ప్రవేటు ఎలక్ట్రికల్ గా పని చేస్తున్న తాటిగూడెం గ్రామనికి చెందిన నవీన్ అనే వ్యక్తి వీరపూరం గ్రామంలోని విద్యుత్ మరమత్తులు చెస్తుండగా ప్రమాదవశాత్తు లెవెన్ కెవి విద్యుత్ వైరు తగిలి గాయాల పాలయ్యారు. వేంటనే విషయం తెలుసుకున్న కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎగ్బాల్ హుషెన్ తన స్వంత వహనంలో ఎక్కించుకొని భద్రాచలం నిఖిత హాస్పిటల్ కి తీసుకెళ్ళి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ విషయమై కరకగూడెం సబ్ స్టేషను ఏఈ ని వివరణ కోరగా వీరపూరం గ్రామంలోని విద్యుత్ సరఫరా మరమత్తులలో భాగంగా ఎల్చీ స్విచ్ తీసుకోని మరమత్తులు అనంతరం స్విచ్ అన్ చేసిన విషయాన్ని మర్చిపోయిన నవీన్ మరల విద్యుత్ తీగ కట్ చేస్తున్న క్రమంలో కుడి చేయి భుజానికి విద్యుత్ వైరు తగిలి గాయాలు అయినట్లు అయన వివరణ ఇచ్చారు.
Navigation
Post A Comment: