CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

క్రికెట్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపీకైన వారికి ఆర్థిక సహాయం అందజేసిన దమ్మపేట LSCS చైర్మన్ రావు జోగేశ్వరావు.

Share it:

 



 మన్యం టివి,దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, వెంకటాద్రి గూడెం, కొమ్ముగూడెం గ్రామాలకు చెందిన క్రీడాకారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు తరుపున ఈనెల 12వ తారీఖున నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగినటువంటి అండర్ఆర్మ్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలలో అత్యత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం,ముష్టిబండ గ్రామ పంచాయితీ లోని వెంకటాద్రిగూడెం గ్రామం నుంచి కాసుమల నాగరాజు, కొమ్ముగూడెం గ్రామం నుంచి సోయం సత్యనారాయణ ఈ ఇద్దరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండర్ ఆర్మ్ క్రికెట్ అసోసియేషన్ వారి ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయి అండర్ ఆర్మ్ క్రికెట్ పోటీలలో జిల్లా తరుఫున మంచి ప్రదర్శన కనబరిచటంతో పాటుగా వచ్చే నెలలో అనగా సెప్టెంబర్ 04,05,06 తేదిలలో జమ్మూకాశ్మీర్లో జరిగేటటువంటి జాతీయస్థాయి అండర్ ఆర్మ్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అర్హులు అవ్వడం జరిగింది. వీరి ప్రతిభను గుర్తించి,వారిని అభినందిస్తూ జమ్మూ కాశ్మీర్ వెళ్లడానికి ఆర్ధిక సహాయం అందించిన దమ్మపేట మండల విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ రావు జోగేశ్వరారావు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ కెవి,పార్టీ నాయకులు విష్ణు,కుకలకుంట రవి,వడ్లగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు నాగేశ్వరరావు,ప్రసాద్ పాల్గొన్నారు.

Share it:

Post A Comment: