మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 31, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని నల్లబండ బోడు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 38 లో అక్రమంగా నమోదైన గిరిజనేతర పట్టాదారుల పేర్లను ధరణి యాప్ నుంచి తొలగించాలని, పట్టాలను రద్దు చేయాలని ఓపీడిఆర్ జిల్లా నాయకులు బచ్చల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. గత సంవత్సరం 38 సర్వేనెంబర్ లో గల అక్రమ పట్టాదారు ల పై జిల్లా కలెక్టర్ కి తాహశీల్దార్ కి వామపక్షాల నాయకులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన తహశీల్దార్ పిఎల్ ఎన్ ప్రసాద్ అక్రమ పట్టాలను రద్దు చేశామని తెలిపారని గుర్తు చేశారు. కానీ..! ఇప్పుడు ధరణి యాప్ లో అక్రమ పట్టాదారుల పేర్లు మరలా వస్తున్నాయని, వారికి పట్టా బుక్కులు సైతం ఇచ్చారని అన్నారు. తద్వారా ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, క్రాఫ్ లోన్స్ పొందుతున్నారని తెలిపారు. అక్రమ పట్టాలు పొందిన కాళ్ళారి ప్రవీణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే పి ఏ భార్య బోర్ల పద్మావతి, ఏతీరాజ్ కుమార్, కాళ్ళారి జ్యోతి, బాదావత్ నరేష్,వీరి పేర్లను వెంటనే తొలగించి, వీరు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పొందిన డబ్బులను రికవరీ చేసి, వీరికి పట్టాలు చేసిన అధికారులపైన, వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, సిపిఎం మండల కార్యదర్శి చీమల పాటి బిక్షం,న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి ఎదులాపురం గోపాలరావు, సిపిఎం నాయకులు భానోత్ ధర్మ, ఊడల వెంకటేశ్వర్లు, సిపిఐ మండల నాయకులు షేక్ నాగుల్ మీరా, కొండ వీరయ్య, పూనం సూరయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: